నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదు – గుడివాడ అమర్నాథ్

-

నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నిన్న సీఎం జగన్ తో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశం అయ్యారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ఈ నెలలో కర్నూల్ 2,500 కోట్లతో అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన పై చర్చించానన్నారు.

మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు. నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదని వివరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పెందుర్తి, చోడవరం అంటూ ప్రచారాలు మాత్రమేనన్నారు. సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు.. నాకు ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసు అన్నారు. నేను పార్టీకి ఎలాంటి సేవ చెయ్యాలో ఆయనకి తెలుసు అని పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news