వైసీపీ ఎమ్మెల్యే నివాసం వద్ద తుపాకీ కలకలం !

-

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లి కార్జున్ రెడ్డి నివాసానికి సమీపంలో కొందరు అనుమానితులు తుపాకీతో సంచరించడం కలకలం రేపుతోంది. రాజంపేట శివారు బైపాస్ రోడ్డులోని మేడా నివాసానికి దగ్గర్లో కొందరు రాత్రి వేళ మందు తాగుతున్నారు. అయితే పెట్రోలింగ్ వాహనం సైరన్ వేసుకు రావడంతో వారు అక్కిడ్ నుండి పరుగు లంకించుకున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా కొందరు పరారయ్యారు.

అదుపులోకి తీసుకున్న కొందరిలో ఒకరి వద్ద తుపాకీ ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఎమ్మెల్యే ఇంటి సమీపంలో వీరు ఎందు కున్నారు..? ఎక్కడి నుంచి వచ్చారు..? తుపాకీ ఎందుకు ఉంది..? అనే విషయాల మీద లోతుగా విచారణ జరుపుతున్నామని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. వీరిలో కొందరు అనంతపురం, మరి కొందరు పులివెందుల ప్రాంతానికి చెందిన వారు అని తెలుస్తుంది. వారి వద్ద తుపాకితో పాటు బుల్లెట్లు కూడా ఉండడంతో అనేక కోణాల్లో రాజంపేట పోలీసుల విచారిస్తున్నట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news