జనసేన కోసం హరి రామ జోగయ్య మరో లేఖ విడుదల

-

జనసేన కోసం హరి రామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు. ప్రజాస్వామి కులైన జనసైనికులందరుకో పిలుపు అంటూ మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య లేఖ విడుదల చేశారు. ఎన్నికల అధికారి ఇచ్చిన మెమో ప్రకారం వాలంటీర్లను ఏ విధమైన ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించరాదని.. ఈ నెల 21 నుండి అర్హులైన కొత్త ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకోవడం అనర్హులైన ఓటర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.

ఈ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకుండా జనసైనికులు అందరూ పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న అనర్హులైన ఓటర్లను ఓట్ల జాబితాలో చేర్చే ప్రమాదం ఉందని.. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఓట్ల జాబితా నుండి తొలగించే ప్రమాదం అని వివరించారు. ఈ ప్రమాదం నుండి తప్పించేందుకు జనసైనికులు అందరూ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలు పాల్గొనకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రావణ రాజ్యం పోవాలన్న రామరాజ్యం రావాలన్నా, జగన్ పోవాలి పవన్ కావాలి ఇదే మన వినోదం అంటూ జోగయ్య జనసైనికులకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news