టీటీడీ చైర్మన్ పదవిపై సీఎం జగన్ పై హరిరామజోగయ్య లేఖ

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. టీటీడీ చైర్మన్ పదవిని రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాపు కులస్తుల అవసరం మీకు ఉన్నదని రుజువు చేసుకోవాలన్న కాపుల పట్ల సానుభూతి ఉన్నా టీటీడీ చైర్మన్ బలిజకి ఇవ్వాలని కాపు కులస్తుల తరఫున కోరుతున్నానని లేఖలో వెల్లడించారు.

Rama Jogaiah
Rama Jogaiah

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు 22 శాతం జనాభా ఉన్నారని.. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దగ్గర నుండి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కాపులను వాడుకోవడం తప్ప కాపులకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ విషయంలో కూడా ఏ రెడ్డి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయలేదు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి సైతం అవకాశం ఉండి కూడా కాపులకు రిజర్వేషన్ కల్పించలేదని చెప్పారు హరిరామజోగయ్య.

Read more RELATED
Recommended to you

Latest news