నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ

-

టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత 11 రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఉన్నారు. 9వ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెల్లారు చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ చంద్రబాబుతో టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు ములాఖాత్ లో పాల్గొంటారు.

Hearing on Chandrababu’s bail petition in AP High Court today

సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసేందుకు ఆయన తరుపున న్యాయవాదులు వెళ్ళనున్నారు. అటు నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. అంగల్లులో దాడి ఘటనలో ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో ఏ1 గా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు.. బెయిల్‌ కావాలని కోరుతున్నారు. ఇక అటు ఇవాళ టీడీపీ శాసనసభా పక్షం సమావేశం జరుగనుంది. టీడీపీ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవనులో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version