మండలిలో సంయమనం కోల్పోయిన బొత్స.. టీడీపీ సభ్యుల మీదకు !

-

ఏపీ శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిన్న మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై మండలిలో ఈరోజు దుమారం చెలరేగింది. వెల్లంపల్లి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని టిడిపి సభ్యుడు రాజేంద్రప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు. వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే రికార్డులు పరిశీలించాలని మంత్రి బొత్స పేర్కొనడంతో బొత్సతో టీడీపీ సభ్యుడు నాగజగదీశ్వర్‍రావు వాగ్వాదానికి దిగారు.

 

ఈ క్రమంలో బుద్దా నాగజగదీశ్వర్‍రావు, బొత్స ఇద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒకరిపైకి మరొకరు కొట్టుకునే దాకా వెళ్లారు. అయితే బొత్సను డొక్కా మాణిక్యవరప్రసాద్ అడ్డుకున్నారు. జగదీశ్వరరావును ఉద్దేశించి మంత్రి బొత్స అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం తాను రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.. ఇక మరోపక్క అసెంబ్లీలో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news