వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై భారీ కసరత్తు..!

-

వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై భారీ కసరత్తు చేస్తున్నారు. టిక్కెట్ ఇవ్వలేని వాళ్లకు క్లారిటీ ఇస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. దాదాపు ఇప్పటికే 11 సెగ్మెంట్లల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. స్థాన చలనం పొందిన వారిలో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. ప్రధానంగా  మద్దాలి గిరి, టీజేఆర్ సుధాకర్ బాబు, తిప్పల నాగిరెడ్డి లకు వచ్చే ఎన్నికల్లో నో టిక్కెట్.

రెండో విడత కసరత్తులోనూ భారీగా మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.  రెండో విడతలో మినిమమ్ ఐదుగురికి నో టిక్కెట్ అని చెప్పే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురి వైసీపీ సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, అనంత జిల్లాల్లో మార్పులపై సెకండ్ ఫేజ్ ఎక్సర్ సైజ్ చేస్తున్నారు.  గత వారం రోజుల  నుంచి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీసుకు క్యూ కట్టారు. దాదాపు  30-35 మంది ప్రజా ప్రతినిధులు సీఎం జగన్ ను కలిశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news