ఏపీలో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు.. జగన్ పై దేవినేని ఉమా ఫైర్

-

ఆంధ్రప్రదేశ్లో మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టుపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా తాజాగా స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాసే పెన్ను చూపించే కెమెరాలపై దాడులు ఒకప్పటి బీహార్ను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. విలేకరులపై దాడులు చేసే ఈయన స్థితికి దిగజారిన జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రధాన పత్రికల పై దాడులు చేస్తున్నారంటే రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. పరదాలు కట్టుకొని, చెట్లు కొట్టేసి వేలాది వాహనాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సభలు పెడుతున్నారని విమర్శించారు. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని సిద్దం సభలు పెట్టుకొని తొడలు కొట్టుకుంటే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు ప్రజలకు ఇచ్చాను అని నువ్వు చెప్పే లక్షల కోట్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news