విశాఖ డ్రగ్స్ కేసు : సీబీఐ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..!

-

విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది.

విశాఖ పోర్టు డ్రగ్స్ కేసుపై సీబీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో సంధ్యా ఆక్వాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది.  లిక్కర్ స్కామ్ కు పాల్పడిన సిండికేట్ సంధ్యా ఆక్వా భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీంతో.. మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును చేధించే పనిలో సీబీఐ దూకుడు పెంచింది.
ఇక, పది మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్యా అక్వా కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో కంటైనర్లలో మెటీరియల్ కి సంబంధించి మరిన్ని శాంపిల్స్ ని విశాఖలో పరిశీలించగా ఫలితాల్లో పాజిటివ్ గా తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news