మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగ లు అరెస్టు..!

-

విశాఖలో మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసారు పోలీసులు. ఐదేళ్లుగా పోలీసులకు చిక్కడు – దొరకడు అన్నట్టు తప్పించుకు తిరుగుతున్నాడు బాల బోయిన రమేష్. రెండ్లెళ్ళుగా విశాఖ నగరంలో 11 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు రమేష్, రఘునందన్. షీలా నగర్ లో ఇంటిని అద్దెకు తీసుకుని దొంగతనాలు చేయడం హాబీగా పెట్టుకున్నారు. అలా దొంగతనాలు చేయడంలో ఆల్ రౌండర్ గా మారిపోయాడు రమేష్.

అయితే వీరు ఇప్పటి వరకు 729 గ్రాములు బంగారం చోరీ చేసినట్టు గుర్తించారు పోలీసులు. దొంగతనాలు చేసిన డబ్బుతో గోవాలో ఎంజాయ్ చేయటం అలవాటుగా పెట్టుకున్నారు. అలాగే బెట్టింగ్ ల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అయితే ఈ రమేష్, రఘునందన్ ఇద్దరు NTR జిల్లాకు చెందిన వాళ్ళు కాగా జైల్లో కుదిరిన స్నేహంతో కలిసి దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news