ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

-

ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువును రేపటి వరకు పొడిగిస్తూ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రెగ్యులర్ ఫీజు రూ. 550, అపరాధ రుసుము రూ.3,000ను రేపు సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ లో చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

Inter Education Department orders extending the fee deadline of Inter First and Secondary Examinations till tomorrow

విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనుండగా…. మార్చి 1 నుంచి 15 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

కాగా, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అటు తెలంగాణ ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈనెల 29వ తేదీ లోపు రూ. 4000 ఆలస్య రుసుముతో కలిపి ఫీజులు చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శనివారం ఉత్తర్వులను జారీచేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు తేదీని పెంచుతున్నామని తెలిపింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news