చిత్తూరులో దారుణం.. యువతిపై అత్యాచారం.. ఆపై కళ్లు పీకి హత్య

-

చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని బావిలో ఓ యువతి మృతదేహం తేలడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమెను అత్యాచారం చేసి కళ్లు పీకి, జట్టు కత్తిరించి హత్య చేశారని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువతి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈనెల 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఇంటర్ విద్యార్థిని మళ్లీ తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో మృతదేహమై కనిపించింది. అయితే ఆమెను మండలానికి చెందిన ముగ్గురు యువకులు ప్రేమపేరుతో వేధించేవారని.. వారే మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి అనంతరం అత్యాచారం చేసి, చంపేసి, కళ్లు పీకి, జుట్టు కత్తిరించి, మృతదేహాన్ని బావిలో పడేశారని మృతురాలి తల్లిదండ్రులు చెప్పారు.

వినాయక నిమజ్జనం కోసం 20వ తేదీన కొందరు బావి వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించింది. మృతదేహం నుంచి నమూనాలను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు ఎస్సై అనిల్‌కుమార్‌ చెప్పారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version