మాజీ మంత్రి రోజా అరెస్ట్ కావడం ఖాయం.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన ఫైల్స్ దగ్ధం ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ ఘటన పై కూటమి నేతలు మండిపడుతున్నారు. తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకే ఫైల్స్ దగ్ధం చేశారని ఆరోపించారు. టీటీడీలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కొందరూ అధికారుల ఒత్తిడితోనే ఫైల్స్ దగ్ధం, శ్రీవాణి ఫైల్స్ దగ్ధం చేశారని విమర్శలు గుప్పించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల శ్రీవారి టికెట్ల పై  దృష్టి సారించింది. రాష్ట్ర మంత్రి రోజా కూడా ప్రతిరోజు పదుల సంఖ్యలో టికెట్లు జారీ చేసినట్టు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. తాజాగా ఆడుదాం ఆంధ్రా క్రీడలపై సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో ఎప్పుడైనా రోజాను అరెస్ట్ చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. రోజా దేశం వదిలి పారిపోవచ్చని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కిరణ్ రాయల్. 

 

Read more RELATED
Recommended to you

Latest news