దళితులను ఆదుకున్నది వైసీపీ ప్రభుత్వమే – హోంమంత్రి తానేటి వనిత

-

దళితులకు అండగా ఉండి, వారిని ఆదుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు హోం మంత్రి తానేటి వనిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే వెంటనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఒకటి రెండు ఘటనలను పత్రికలలో ప్రచురించి వైసిపి నుంచి దళితులను దూరం చేయాలని ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

దళితులకు అత్యధిక భద్రత కల్పిస్తున్నది సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. టిడిపి హయాంలో దళితులపై దాడులకు సంబంధించి రాష్ట్రం.. దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచిందన్నారు. తనలాంటి సాధారణ దళిత మహిళకు రాష్ట్ర హోం మంత్రిగా అవకాశం కల్పించింది జగనన్నే అని చెప్పుకొచ్చారు తానేటి వనిత.

Read more RELATED
Recommended to you

Latest news