బైజూస్ ట్యాబుల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్

-

అమరావతి: బైజూస్ ట్యాబుల వ్యవహరంపై కీలక ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బైజూస్ సంస్థ నష్టాల్లో ఉందన్న కథనాలను ట్యాగ్ చేస్తూ పీఎంఓ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి తన ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ కేంద్రం దృష్టి కి తీసుకెళ్లారు. ఇక ఇప్పటివరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

“టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు, నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు వస్తాయి. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిందా..?, ట్యాబు పంపిణీ కోసం ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేశాయి..?, ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు..?, ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా?, వైసీపీ ప్రభుత్వం స్పందించాలి. ట్యాబ్‌లు మంచివే.. కానీ ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించండి. యాప్‌ ల కన్నా ముందు ఉపాధ్యాయుడు తప్పని సరిగా ఉండేలా‌ చూడండి” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి చురకలంటిచారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news