ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఓ ధ్రువతార – మంత్రి మేరుగ

-

ప్రకాశం: వైసిపి ప్రభుత్వ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయని టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు మంత్రి మెరుగ నాగార్జున. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై మూకుమ్మడి దాడులు జరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చిన్న చిన్న దాడులు అక్కడక్కడా జరిగాయన్నారు. జగన్ వైశ్యులకి అండగా ఉన్నారని తెలిపారు.

రోశయ్య పై గౌరవం ఉంది కాబట్టే ఆయన పుట్టిన ఊరిలో విగ్రహం పెట్టామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఓ ధ్రువతార అని కొనియాడారు. ఎన్ని శక్తులు కలిసినా జగన్ ఎదుగుదలని ఆపలేరని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసేది వారాహి యాత్రా..? నారాహి యాత్రా..? అంటూ ఎద్దేవా చేశారు. దుమ్ము, ధైర్యం ఉంటే ఎవరైనా 175 స్థానాల్లో విడివిడిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news