గర్భిణీ మహిళలకు జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త

-

గర్భిణీ మహిళలకు జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. తిరుపతిలో వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను చిత్తూర్ జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బిడ్డకు, జన్మనిచ్చిన ప్రతి తల్లికీ త్వరలోనే ఆర్థిక సహాయం కూడా వైఎస్ జగన్ సర్కార్ అందిస్తుందని ఈ సందర్భంగా పెద్ది రెడ్డి ప్రకటన చేశారు.

చిత్తూరు జిల్లా కు కేటాయించిన 52 వాహనాలను శనివారం తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…. సీఎం వైఎస్ జగన్ 500 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వెహికల్ ప్రారంభిస్తే అందులో 52 చిత్తూరుకు అందాయని.. విద్య, వైద్యం కోసం ఈ ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుందని చెప్పారు.

అన్ని సదుపాయాలతో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ నూతన వాహనాలు అందించారని… గతంలో కంటే మెరుగ్గా ఈ వాహనాలను తీర్చిదిద్దారన్నారు.నాణ్యమైన మందులు కూడా అందిస్తున్నారని.. 108, 104 అంటూ వైద్యానికి, నాడు నేడు ద్వారా విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news