జగన్ సిబిఐ కోర్టులో దావోస్ వెళ్తున్న అని చెప్పి, లండన్ ఎందుకు వెళ్లారో ?: అయ్యన్న పాత్రుడు

-

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన లండన్ వెళ్లారు అని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అది కూడా అత్యంత ఖర్చు ఉండే విమానంలో వెళ్లారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ లీనియజ్ 1000. ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ ఇది. దీనికి ఖర్చు గంటకు 14 వేల ఐదు వందల డాలర్లు. అంటే గంటకు రూ.12 లక్షలు.

జగన్ రెడ్డి దావోస్ అని చెప్పి లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్టు లో దిగారని తెలుస్తుంది అన్నారు. లావిష్ ఫ్లైట్లో రాయల్ గా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి వెళ్తున్నాడు జగన్ రెడ్డి.. మన పొట్టలు కొట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అని విమర్శించారు. ఇక జగన్ రెడ్డి సిబిఐ కోర్టులో తాను దావోస్ వెళ్తున్న అని చెప్పి, లండన్ వరకు ఎందుకు వెళ్లారో మరి..? ఆ చిదంబర రహస్యం ఏమిటో..? మీ ఎంపీ గారు చెప్పింది నిజమేనా అయితే.?” అని అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news