ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన జగన్‌ రెండో రోజు బస్సుయాత్ర

-

ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ రెండో రోజు బస్సుయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నైట్‌హాల్ట్‌ పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు కలిశారు. ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు పలువురు టీడీపీ నేతలు.

Jagan’s second day bus journey started from Allagadda

జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ చేరారు. వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు టీడీపీ మాజీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి.
వైయస్‌.జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్‌ పంచాయితీ మాజీ సర్పంచ్‌ వీ ఎస్‌ కృష్ణమూర్తి(లాయర్‌ బాబు).

Read more RELATED
Recommended to you

Latest news