రామోజీ రావు మరణంపై జగన్ ట్వీట్..!

-

రామోజీ రావు మరణంపై జగన్ ట్వీట్ చేశారు. రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్‌ అయ్యారు. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు. కాగా రామోజీరావుకు జగన్‌ కుటుంబానికి విభేధాలు ఉన్న సంగతి తెలిసిందే.

Jagan’s tweet on Ramoji Rao’s death
అటు ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు మృతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news