జగన్ తిరుమల పర్యటన.. కూటమి కీలక నిర్ణయం

-

శుక్రవారం రోజున తిరుమల శ్రీవారి సన్నిధికి వైయస్ జగన్మోహన్ రెడ్డి రానున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం తిరుమల కు చేరుకొనున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు.. అలర్ట్ అయ్యారు. అంతేకాదు సెక్షన్ 30 పోలీస్ రూల్ ను అమలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో…. కూటమి పార్టీలు కీలక నిర్ణయం తీసుకుంది.

Jagan’s visit to Tirumala a key decision of the alliance

జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లే మార్గంలో శాంతియుత నిరసనలు తెలుపాలని… కూటమి పార్టీలు నిర్ణయం తీసుకుంది. లడ్డు కల్తీ కి జగన్మోహన్ రెడ్డి కారణమని… నిరసన తెలుపాలని… కూటమిలో ఉన్న కార్యకర్తలకు పిలుపునిచ్చింది. అయితే తిరుమలలో సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో… ర్యాలీలు, నిరసనలు లాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఇప్పటికే తిరుపతి పోలీసులు హెచ్చరించారు. మరి ఇలాంటి నేపథ్యంలో కూటమి పార్టీల కార్యకర్తలు ఎలా నిరసనలు తెలుపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version