సుదర్శన్ థియేటర్ లో ఎన్టీఆర్ కటౌట్ కి నిప్పు..!

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇవాళ అర్థరాత్రి 1గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచే షోలు ప్రారంభం అయ్యాయి. కేవలం కొన్ని థియేటర్లలో మాత్రం ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమాకు మిశ్రమ టాక్ లభిస్తోంది. సినిమా ఎలా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టపాసుల మోతతో ప్రతి థియేటర్ వద్ద సంబురాలు జరుపుకుంటున్నారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ 35 ఎం.ఎం థియేటర్ వద్ద అభిమానులు దేవరకి  సినిమాకి సంబంధించి భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కటౌట్ కి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చోసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది  అక్కడికి చేరుకొని మంటలు  ఆర్పారు. కటౌట్ కి నిప్పు పెట్టడం పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version