BREAKING : తిరుపతి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు పవన్ కళ్యాణ్.ఈ తరుణంలోనే, తిరుపతిలో భారీ ర్యాలీ చేపట్టారు పవన్ కళ్యాణ్. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ నుంచి టౌన్ క్లబ్ వరకు కొనసాగనుంది పవన్ కళ్యాణ్ ర్యాలీ. ఇక పవన్ ర్యాలీకి భారీగా తరలివచ్చారు జనసేన కార్యకర్తలు. దీంతో కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసులు.

కాగా, ఐదు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో సాయి అనే పవన్ కళ్యాణ్ కార్యకర్తపై చేయి చేసుకుంది సీఐ అంజు యాదవ్. అయితే, ఇప్పటివరకు అంజూ యాదవ్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడం పట్ల జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అంజు యాదవ్ వ్యవహారంపై ఇప్పటికే డిజిపి కి నివేదిక పంపడంతో పాటు చార్జ్ మోమె జారీ చేసారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వ్యవహారం పై నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేసి, అనంతరం ఢిల్లీ పయనం అవుతాడు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news