నేడు టీటీడీ ఈఓగా బాద్యతలు స్వీకరించనున్న జవహర్ రెడ్డి

-

టీటీడీ ఈవోగా నేడు జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు కాలినడకన తిరుమల చేరుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో మధ్యాహ్నం 12.30 నిమిషాలకు టీటీడీ ఈవోగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ రోజు స్వామివారికి ఇష్టం అయిన రోజు కావడంతో ఈరోజే తిరుమల ఆలయంలో టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన వైద్య ఆరోగ్యశాఖ నుండి తప్పుకుంటూ చివరిగా పెట్టిన సంతకం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో A2, A3గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులు, ఎస్వీ వైద్యకళాశాల పీడియాట్రిక్స్ విభాగం ప్రొఫెసర్ గా డా.కిరీటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డా.శశి కుమార్ ను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జరీ చేశారు ఆయన.

Read more RELATED
Recommended to you

Latest news