భీమవరం అనగానే పవన్ కళ్యాణ్ కు జ్వరం వచ్చింది – జోగి రమేష్

-

భీమవరం అనగానే పవన్ కళ్యాణ్ కు జ్వరం వచ్చిందని…వణుకు పుడుతుందని జనసేనానికి చురకలు అంటించారు జోగి రమేష్‌. అచ్చెన్నాయుడు విసిరిన ఛాలెంజ్ స్వీకరిచిన మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పార్టీ లేదు బొక్కా లేదు అన్నాడు అచ్చెన్నాయుడు… బొక్క పార్టీకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంటూ రెచ్చిపోయారు.

జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడని… ప్రకాశిస్తున్న నవ రత్నాలు, పారిపోతున్న చంద్రబాబు నాయుడు అంటే ట్యాగ్ లైన్ సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడు సవాలును స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, చీము నెత్తురు ఉంటే కుప్పం, టెక్కలి నియోజకవర్గాల్లో ఛాలెంజ్‌… మీకు నచ్చిన గ్రామాలను సెలెక్ట్ చేయండన్నారు. టీడీపీ 2014-19 హయాంలో ఆ గ్రామాల్లోని ప్రజలకు ఏం లబ్ది జరిగింది, జగన్ ప్రభుత్వంలోని గత నాలుగేళల్లో ఏ సంక్షేమ పథకాలు అందాయో లెక్కలు తీద్దామని సవాల్‌ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా? ఈ ఛాలెంజ్ కు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఫైర్‌ అయ్యారు జోగి రమేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news