ఇండియా-పాక్ యుద్ధం ఆపేందుకు టర్కీ వెళ్లేందుకు కేఏ పాల్ యత్నం చేస్తున్నారు. కానీ.. ఆయన్ను, 4గురు సభ్యుల బృందాన్ని ముంబై ఎయిర్పోర్టులో అడ్డుకున్నారు అధికారులు. శాంతి చర్చల కోసం టర్కీకి వెళ్లే ప్రయత్నంలో.. ఇండిగో ఫ్లైట్ 6E 017కి అనుమతి నిరాకరించారు. #BoycottIndigo హ్యాష్ట్యాగ్తో ఈ ఘటనను వైరల్ చేస్తున్నారు.

ఇక అటు కాల్పుల విరమణ ఒప్పందం పట్ల ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసిన ఆయన, భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తాను అడ్డుకున్నానని ప్రకటన చేశారు. “రాత్రింబగలు కష్టపడి భారత్ – పాక్ యుద్ధాన్ని నిలిపేశాను. అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, ఇరు దేశాల నేతలతో చర్చలు జరిపాను. శాంతి కోసం ప్రయత్నాలు చేశాను,” అని పేర్కొన్నారు.