భార్యా పిల్లలను కాల్చి చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య

-

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కడప జిల్లాలోని స్థానిక కో ఆపరేటివ్ కాలనీలో ఓ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలను పిస్తోలుతో కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపలోని స్థానిక కోపరేటివ్‌ కాలనీలో నివాసముండే వెంకటేశ్వర్లు (50) కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్‌ నుంచి పిస్తోలు తెచ్చుకున్నాడు. ఇంటికి రాగానే.. తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి.. కానిస్టేబుల్‌ ఇలా చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్‌ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news