ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఓఎస్డీగా కడప ఆర్డీవో..!

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఓఎస్డీగా యువ అధికారి మధుసూదన్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన కడప ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ధర్మవరం ఆర్డీవోగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కడపలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు మధుసూదన్‌ కీలక చర్యలు తీసుకున్నారు. అవి సత్ఫలితాలను కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఏరికోరి పవన్‌ కల్యాణ్‌కు ఓఎస్డీగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఓఎస్డీగా నియమితులైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను మధుసూదన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

పవన్‌ కల్యాణ్‌ ఓఎస్డీగా యువ ఐఏఎస్‌ కృష్ణ చైతన్యను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఓఎస్డీలుగా గ్రూప్‌ 1 స్థాయి అధికారులు, ఆర్డీవోలను నియమిస్తుంటారు. కానీ తన తీరుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ ఐఏఎస్‌ అధికారి కృష్ణ చైతన్యను ఓఎస్డీగా నియమించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా అనుమతించారు. కానీ కృష్ణ చైతన్య ప్రస్తుతం కేరళ రాష్ట్ర కేడర్‌లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ చైతన్యను డిప్యూటేషన్‌పై ఏపీకి పంపించాలని కేరళ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. త్వరలోనే కృష్ణచైతన్య కూడా డిప్యూటేషన్‌పై వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news