రైల్వే ట్రాక్ పక్కన బాబు నిలబడితే…తప్పిన ప్రమాదం అంటూ జాకీలు పెడుతున్నారు – కాకాణీ

-

రైల్వే ట్రాక్ పక్కన చంద్రబాబు నిలబడితే… బాబు కు తప్పిన ప్రమాదం అంటూ ప్రచారం చేశారని సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ప్రజలను ఎలా కాపాడాలనే విషయంపై దృష్టి సారించాలని… ప్రభుత్వం విఫలం కావడం వల్లే పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహించారు. అన్ని మరణాలను చంద్రబాబు హత్యలుగానే పరిగణించాలని చురకలు అంటించారు.


చంద్రబాబుది అక్రమ అరెస్టు అని పచ్చ మీడియా గగ్గోలు పెడుతోందని… చంద్రబాబుకు ఈ మీడియా క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబును జాకీలు పెట్టి పచ్చ మీడియా ఎత్తుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహించారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీకి వైసీపీకి చెందిన వారి బోట్లు వచ్చాయని చెబుతున్నారని తెలిపారు. ఇది ఒక కుట్రలో భాగం అన్నారు. మత్స్యకారుల బూట్లు కొట్టుకుపోయాయి ..ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని… పాడి పరిశ్రమ దెబ్బతిందని తెలిపారు. అందరిని ఆదుకోవాలని ఆ బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news