కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు వన్ టు వన్ విచారణ సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. ఈ సందర్బంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై కేసీఆర్ను ప్రశ్నించింది కమిషన్. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని బదులిచ్చారట కేసీఆర్.

బ్యారేజీల్లో నీళ్లు నింపమని ఎవరు ఆదేశించారన్న కమిషన్ ప్రశ్నకు.. టెక్నికల్ అంశాల ఆధారంగా అధికారులు స్టోరేజ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేసీఆర్. బ్యారేజీల లొకేషన్స్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కమిషన్ అడగడంతో.. టెక్నికల్ నివేదికల ఆధారంగా బ్యారేజీల లొకేషన్స్ మార్పులు జరిగాయని సమాధానం ఇచ్చారట. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతి అంశానికి కేబినెట్ అనుమతి ఉందని తెలిపారట కేసీఆర్. ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన లేఖలు, CWC లేఖలను కమిషన్కు వివరించిన కేసీఆర్.. నేరుగా ఆస్పత్రికి వెళ్లారు.