వైసీపీ గూటికి జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్ ?

-

వైసీపీ గూటికి వెళ్లేందుకు జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో భాగంగా టిడిపికే కేటాయించారని ప్రచారం జోరుగా ప్రచారం జరుగుతోంది. జనసేన టికెట్ ఆశిస్తున్న కందుల దుర్గేష్ ను నిడదవోలు పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం అందుతోంది. దీంతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీలో అసంతృప్తి నెలకొందని సమాచారం.

kandula durgesh into ycp

రాజమండ్రి రూరల్ లో కందుల దుర్గేష్ కే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తు న్నారు కందుల దుర్గేష్ కార్యకర్తలు, అనుచరులు. ఇందులో భాగంగానే.. జనసేన రాజమండ్రి రూరల్ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. అటు పార్టీ శ్రేణులతో సమావేశమైన కందుల దుర్గేష్… నిడదవోలులో పోటీ చేయాలా ? లేక సైలెంట్ అవ్వాలా అనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే.. వైసీపీ గూటికి వెళ్లేందుకు జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news