100 మందితో తొలి జాబితా..ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ

-

వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లకుపైగా సాధించాలని అంటుండగా బీజేపీ సొంతంగా 370 సీట్లలో విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సహా ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి నెలలో విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో 100 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది బీజేపీ.వచ్చే గురువారం అనగా ఫిబ్రవరి 29నాడు బీజేపీ కేంద్ర నాయకత్వం సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే 100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది.

ఈ నెల 29న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశo జరుగనుంది. అభ్యర్థుల తొలి జాబితాపై ఈ సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.అదే రోజు తొలి జాబితా విడుదల చేసి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం విడుదల చేయనున్న తొలి జాబితా రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఈ జాబితాలోనే ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా పేర్లు ఉండబోతున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం యూపీలోని వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఇక్కడి నుంచి గెలిచారు.

2014లో మోదీకి 3.37 లక్షల మెజార్టీ రాగా 2019 ఎన్నికల్లో అంతకు మించి 4.8 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ వృద్ధనేత ఎల్కే అద్వానీ గతంలో ప్రాతినిధ్యంవహిస్తూ వచ్చిన గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నిక్లలో అమిత్ షా పోటీ చేసి గెలిచారు.ఇప్పుడు కూడా అక్కడినుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

370 స్థానాల్లో గెలిచే లక్ష్యంతో పనిచేయాలని బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే దిశానిర్ధేశం చేశారు. రాబోయే 100 రోజులు చాలా కీలకమని కూడా సూచించారు ఈ 100 రోజుల్లో ప్రతి ఓటరు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు, ప్రతి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి దగ్గరకు వెళ్లాలని సూచించారు.ఎన్డీయే సీట్లు 400, ఒక్క బీజేపీ సీట్లు 370ని అధిగమించాలని పార్టీ జాతీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఈ సారి గెలిచేది అధికార భోగాలు అనుభవించేందుకు కాదని దేశానికి సేవ చేసేందుకే మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోవాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.మరొక్కసారి అవకాశమిస్తే దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news