ఫిబ్రవరి 2న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ ?

-

ఫిబ్రవరి 2న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Central Election Commission visit in AP today and tomorrow

అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఇక అటు ఏపీలో ఎన్నిక నిర్వాహనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ముందే 12D వారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని అధికారులు పరిశీలించి ఓట్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విధానాన్ని ఈసీ విజయవంతంగా అమలుచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news