Ayodya Temple : రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే!

-

అయోధ్యలో రాముడి దర్శనానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఎంతమంది వచ్చినా ఉచిత దర్శనం కల్పించనుంది. ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఒకే తరహా దర్శనానికి ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ayodhya Ramayya darshan, prasad is free

దర్శనంతో పాటు ప్రసాదం కూడా ఉచితంగానే అందించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఉచిత వసతి కల్పనపైనా ఆలోచనలు చేస్తున్నారు. ఇక అటు అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు. ఇక జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news