‘సలార్‌ 2’లో అఖిల్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ వైఫ్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ బ్లాక్బస్టర్ టాక్తో దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ పార్ట్(సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్)తో అదరగొట్టిన ప్రశాంత్‌ నీల్‌ సెకెండ్ పార్ట్కు ‘శౌర్యాంగపర్వం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో పార్ట్-2లో అక్కినేని అఖిల్ కేమియో చేస్తున్నట్లు నెట్టింట వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్స్పై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయిన లిఖితా.. అఖిల్ కేమియో లేదని.. అవన్నీ వదంతులు మాత్రమేనని చెప్పారు. ‘సలార్‌ పార్ట్‌ 2’ గురించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో ఓ నెటిజన్ పార్ట్-2లో దేవా, వరదకు మధ్య ఫైట్ ఉంటుందా అని అడిగితే ఒక్కసారి ఊహించుకోండి అంటూ సమాధానమిచ్చారు. అలాగే ‘సలార్‌ పార్ట్‌ 2’లో ప్రశాంత్‌ నీల్ కేమియో ఏమైనా చేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన నీడ కూడా కనిపించదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news