టీడీపీ పార్టీ జోలికి ఇక అస్సలు వెళ్ళను – కేశినేని నాని

-

టీడీపీ పార్టీ జోలికి ఇక అస్సలు వెళ్ళను అని ప్రకటించారు కేశినేని నాని. కేశినేని నానికి చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. బెజవాడ ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్ఫష్టం చేశారు చంద్రబాబు నాయుడు. ఇదే విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసారు ఎంపీ కేశినేని నాని. తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ అధిష్టానం… బెజవాడ ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్ఫష్టం చేసింది.

ఇక దీనిపై ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ…నిన్న సాయంత్రం చంద్రబాబుగారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాంగారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ గారు నన్ను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు గారు నియమించారని పేర్కొన్నారు.

కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియచేసారు. అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాలలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియచేసారని ఎంపీ కేశినేని నాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news