సిగ్గు శరం లేకుండా ఎన్టీఆర్ కు పురంధేశ్వరి ద్రోహం చేసింది – కొడాలి నాని

-

సిగ్గు శరం లేకుండా ఎన్టీఆర్ కు పురంధేశ్వరి ద్రోహం చేసిందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వాక్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి పురందేశ్వరి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారని నాని ఆరోపించారు.

kodali nani slams purandeshwari

చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి ఎన్టీఆర్ కు తీరని ద్రోహం చేశారన్నారు. తండ్రికి వెన్నుపోటు పొడిచి….. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు పురందేశ్వరి ముఖ్యపాత్ర పోషించారని కీలక వాక్యాలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. పురందేశ్వరి వంటి కూతురు ప్రపంచంలో ఏ తండ్రికి ఉండకూడదు అంటూ సంచలన కామెంట్లు చేశారు కొడాలి నాని. జగన్ ఇసుక దోపిడీ అంటూ సిగ్గులేని ఆరోపణలు చేస్తోందని.. రూ. 4 వేలు కోట్లు ఆదాయం జగన్ హయాంలో ఇసుక ద్వారా వచ్చిందని చురకలు అంటించారు మాజీ మంత్రి కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version