పాలమూరు ప్రాజెక్ట్ నీటి వినియోగంపై ఏపీకి ఎదురుదెబ్బ

-

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రైబ్యునల్ గట్టి షాక్ ఇచ్చింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ఇంటర్‌లొకేటరీ వేసిన అప్లికేషన్​ను తిరస్కరించింది. తెలంగాణ 90 టీఎంసీల నీరు వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను విచారించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. అయితే, దీనిపై సరైన వేదికకు వెళ్లే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

2022 ఆగస్టులో తెలంగాణ ఇచ్చిన జీవో 246పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు వేసింది. దీంతో ట్రైబ్యునల్‌లో జులై 14 వరకు వాదనలు జరిగాయి. తాజాగా ఈ అంశంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై విచారణ అధికారం తమకు లేదని.. తగిన వేదికలను ఆశ్రయించాలని తుది ఉత్తర్వుల్లో ట్రైబ్యునల్‌ పేర్కొంది.

పాలమూరు ప్రాజెక్ట్​పై కృష్ణా ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై కృష్ణా ట్రెబ్యునల్‌ తీర్పును మంత్రి స్వాగతించారు. ఇది పాలమూరు విజయంగా అభివర్ణించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90టీఎంసీల వరకు కృష్ణా జలాలు తీసుకోవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news