కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి లక్ష్మీపార్వతి !

-

Laxmi parvathi: కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. ఈ సందర్భంగా 23, 24 వ వార్డుల్లో పర్యటించారు లక్ష్మీపార్వతి.

Lakshmi Parvati enters the field to defeat Chandrababu in Kuppam

ఈ తరుణంలోనే… తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కి రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి.

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్, భరత్ సతీమణి దుర్గ,కుప్పం నియోజకవర్గ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అయితే… కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే… భరత్‌ కు మంత్రి పదవి ఇస్తానని జగన్‌ ఇప్పటికే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news