జనజాతర సభపై రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. జనజాతర సభలు, కార్నర్ మీటింగులు, రోడ్షోలతో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇక సభలు, సమావేశాల అనంతరం వాటికి ప్రజల నుంచి వచ్చిన ఆదరణను తన సోషల్ మీడియా ఖాతాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం రోజున జమ్మికుంట, పరకాల జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్.. ఆ సభకు వచ్చిన స్పందన గురించి తాజాగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ జన జాతర.. రిజర్వేషన్ల వ్యతిరేకులకు వేస్తుంది పాతర… తెలంగాణ సంపద దోచినోళ్ల గుండెల్లో పుట్టిస్తుంది గత్తర. అంటూ పరకాల సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనానికి సంబంధిన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news