ప్రకాశంలో విషాదం.. లీకైన అమ్మోనియం విషవాయువు..ఏకంగా 16 మంది !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మున్నంగి సీఫుడ్స్ లో విష వాయువు లీకైంది. దీంతో ఏకంగా 16 మంది ఒరిస్సాకి చెందిన కార్మికులు స్పృహ కోల్పోయారు.

ఈ సంఘటన జరుగగానే… చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కి 16 మంది ఒరిస్సాకి చెందిన కార్మికులను తరలించారు స్థానికులు. అమ్మోనియం గ్యాస్ లీకైనట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మున్నంగి సీ ఫుడ్స్ లో విష వాయువు లీకు కావడం వెనుక ఎవరి హస్తమైన ఉందా… అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇక గత కొంత కాలంగా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news