లోకేష్ నోరు తిర‌గ‌క పోతే భాష నేర్చుకో – ఎంపీ గోరంట్ల మాధ‌వ్

-

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నారా లోకేష్ ను వాడు, వీడు అంటు ఏక వ‌చ‌నం తో పిలుస్తూ వ్య‌క్తి గ‌త విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌భుత్వ జీవో ను కూడా నారా లోకేష్ కు ప‌ల‌క‌రాదు అంటు విమ‌ర్శించాడు. జీవో ను నారా లోకేష్ నోరు తిర‌క‌గ జీయో అని అంటాడ‌ని ఎద్ద‌వా చేశాడు. నారా లోకేష్ కు నోరు తిర‌గ‌క పోతే ఇంట్లో కూర్చోవాల‌ని అన్నాడు. అంతే కాకుండా నారా లోకేష్ త‌ప్ప‌ని స‌రిగా తెలుగు భాష నేర్చు కోవాల‌ని అన్నాడు.

తెలుగు భాష స‌రిగ్గా రాకుండా ప్రెస్ మీట్లు , ప్రజలలో మీటీంగులు పెట్టోద్దని అన్నాడు. తెలుగు భాష స‌రిగ్గా రాకుండా ప్రెసె మీట్ లు నిర్వ‌హిస్తూ తెలుగు ను కూనీ చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. తెలుగు ప‌దాలు ప‌ల‌క‌డానికి ఇబ్బంది ప‌డుతున్న టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గాడికి నోటీ లో పప్పు గుత్తి పెట్టి తిప్పండి అంటు ఘాటు వ్యాక్య‌లు చేశారు. అయితే టీడీపీ జాతీయ కార్యాల‌యం పై దాడి చేసిన నాటి నుంచి టీడీపీ, వైఎస్ ఆర్ సీపీ నాయ‌కుల మ‌ధ్య మాటల యుద్ధం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ మాటల యుద్ధం కాస్త వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల వైపు వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news