రామ్మోహన్‌ నాయుడిని అభినందించిన స్పీకర్ ఓం బిర్లా

-

లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడిని అభినందించారు. పౌర విమానయాన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సభ్యులకు సవివరంగా సమాధానం ఇస్తున్నారని స్పీకర్‌ కితాబిచ్చారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రామ్మోహన్‌ నాయుడని ఆయన పొగడ్తలతో ముంచారు.

దేశంలో ఎంఆర్‌ఓల ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్య పక్షాలు, పరిశ్రమలు, విమానయాన సంస్థలతో ఎలాంటి చర్యలు తీసుకుంది, కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి ఎలాంటి శిక్షణ ఇస్తుందని ప్రశ్నించిన బీజేపీ సభ్యుడు దుష్యంత్‌ సింగ్‌ అడిగిన ప్రశ్నలకు రామ్మోహన్ నాయుడు సవివరంగా సమాధానం ఇచ్చారు. దేశంలో ఎంఆర్‌ఓల ఏర్పాటుకు తీసుకున్న చర్యలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఏవిధంగా కృషి చేస్తుందో వివరించారు. దీనిపైనే సభాపతి ఓం బిర్లా స్పందిస్తూ.. రామ్మోహన్ రాయుడు సమాధానం చెప్పే తీరును ప్రశంసించారు. సబ్జెట్ డీవియేట్ కాకుండా సవివరంగా సమాధానాలు చెబుతున్నారంటూ కేంద్రమంత్రిని స్పీకర్ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news