భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏనే – లోకేష్

-

భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ DNAనే అంటూ నారా లోకేష్ ఆగ్రహించారు. టీడీపీ విస్తృత స్థాయీ సమావేశంలో నారా లోకేష్‌ మాట్లాడుతూ… నా తల్లి.. బ్రహ్మాణిలు కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట…భోజనంలో విషం కలపడం.. బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్ఏనే అంటూ ఫైర్‌ అయ్యారు. స్కిల్ కేసులో ఆధారాల్లేక కార్యకర్తలిచ్చిన పార్టీ ఫండ్.. అవినీతి సొమ్ము అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Nara Lokesh Write a Letter to CM Jagan
Nara Lokesh Write a Letter to CM Jagan

తన తల్లిపై కేసు పెడతామని సీఐడీ బెదిరించిందంటూ లోకేష్ వెల్లడించారు. తన తల్లి, తన భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా..? అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి సంక్షోభాలు కొత్తేం కాదు…ఇందిరాగాంధీ సీఎంగా ఉన్న ఎన్టీఆరు భర్తరఫ్ చేస్తే మన నేతలు పోరాడారు….కానీ ఆ సంక్షోభం వేరు.. ఈ సంక్షోభం వేరన్నారు. చంద్రబాబును జైల్లో ఉంటే టీడీపీ భయపడుతోందని జహన్ అనుకున్నారు….భయం అనేదే టీడీపీ బయోడేటాలో లేదని వెల్లడించారు. ఇందిరాగాంధీకే భయపడలేదు.. మరుగుజ్జు జగనుకు భయపడతామా..? వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు….చంద్రబాబు ఫ్యామ్లీని ఇబ్బంది పెట్టడమే సైకో జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news