లోకేష్ పాదయాత్ర పల్నాడులో చరిత్ర సృష్టిస్తుంది – ప్రత్తిపాటి పుల్లారావు

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆగస్టు 1న ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కెల్లంపల్లి నుండి ఉదయం 9 గంటలకు పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెంలోకి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెం లో ఆదివారం టీడీపీ సీనియర్ నేతలతో కలిసి పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు ఆ పార్టీ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర పల్నాడులో చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. వినుకొండ నుండి పెదకూరపాడు వరకు ఐదు నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర ఉంటుందని తెలిపారు. పల్నాడు వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీని లోకేష్ ఎండగడతారని పేర్కొన్నారు. వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు లోకేష్ పాదయాత్ర చేపట్టారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news