ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

-

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. జాండీస్ తో బాధపడుతున్న ఆయన మూడు రోజులుగా నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కిరణ్మై, కుమార్తె ఉన్నారు.

కుమారుని మరణంతో మహిపాల్ రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షల మంది ప్రజలకు నిరంతరం సేవచేసే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news