అబ్బాయే బాబాయ్‌ని చంపేశాడు.. చెల్లెమ్మ కూడా అదే చెప్పింది : నారా లోకేశ్ ట్వీట్

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల  వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వాంగ్మూలం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. అది జగనాసుర రక్త చరిత్ర అని చెల్లి షర్మిల చెప్పేసిందంటూ ట్వీట్ చేశారు.

‘‘అబ్బాయే బాబాయ్‌ని చంపేశాడు. అది జగనాసుర రక్త చరిత్ర అని షర్మిల కూడా తేల్చేశారు. బాబాయ్‌ని చంపింది తన అన్నే కావొచ్చని షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారు. అవినాష్‌ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడటమే కారణంగా షర్మిల పేర్కొన్నారు’’ అని లోకేశ్‌ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇంతకీ షర్మిల సీబీఐ వాంగ్మూలంలో ఏం చెప్పారంటే.. ‘‘నా వద్ద ఆధారాల్లేవు కానీ రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు.. పెద్ద కారణం ఉంది. అవినాష్‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతడికి టికెట్‌ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామన్నారు. జగన్‌ ను కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారు. జగన్‌ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదు. బాబాయ్‌ పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నాను’’ అని షర్మిల పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news