భార్యను బెదిరించబోయి చనిపోయిన భర్త…

-

భార్యకు దూరంగా ఉండలేని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. భార్య రావాలని అతను కోరినా ఆమె రాకపోవడంతో బెదిరించబోయి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏం జరిగింది అనేది తాళ్ళపూడి ఎస్సై కథనం ప్రకారం చూస్తే, తాళ్ళపూడి మండలానికి చెందిన మలకలపల్లి గ్రామంలో నివాసం ఉండే గణేష్ అనే వ్యక్తి భార్య ఆర్ధిక ఇబ్బందులతో… కువైట్ వెళ్ళింది.

ఆమె రావాలని తాను ఇక్కడ ఒంటరి గా ఉండలేకపోతున్నా అని చాలా రోజుల నుంచి ఆమె తల్లి తండ్రులను కూడా అతను కోరుతున్నాడు. ఆమె వెళ్ళింది 5 నెలల క్రితమే. అయినా సరే ఆమె మాత్రం రావడానికి ఇష్టపడటం లేదు. దీనితో నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అంటూ ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలోనే ఒక వీడియో రికార్డ్ చేసి భార్యకు పంపించాలి అనుకున్నాడు.

ఆదివారం రాత్రి ఉరేసుకుంటున్నట్లు భార్యను బెదిరిద్దామని ఫ్యాన్‌కు తాడు బిగించి… వీడియో రికార్డ్ చేసే ప్రయత్నం చేసాడు. ప్రమాదవశాత్తూ తాడు మెడకు బిగుసుకుపోవడంతో గణేష్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అంతా వీడియో లో రికార్డ్ అయింది. గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు పగలకొట్టి చూడగా మరణించి ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news