BREAKING : వైసీపీ ఎమ్మెల్యేకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌..హైదరాబాద్‌ కు తరలింపు

-

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చింది. దీంతో అత్యవసర వైద్య సహాయం నిమిత్తం హైదరాబాద్ లోని కిమ్స్ కు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును తరలించారు ఆయన కుటుంబ సభ్యులు.

ఈ తరుణంలోనే…హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి మూడు రోజుల పాటు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు సూచనలు చేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆరోగ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు చెప్పుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నిలకడగా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆరోగ్యం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news