ఏపీ రైతులకు శుభవార్త.. ఇకపై వారి కోసం “పొలం పిలుస్తోంది” కార్యక్రమం

-

ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్‌. ఇకపై రైతుల కోసం “పొలం పిలుస్తోంది” కార్యక్రమం చేపట్టనుంది ఏపీ సర్కార్‌. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు.

Minister Achchennaidu on polam pilusthondi

ప్రతి మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల వద్దకే వెళ్లి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు అధికారులు. 2014-19 మధ్య కాలంలో కూడా పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపట్టిన నాటి టీడీపీ ప్రభుత్వం… ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తోంది. పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామని తెలిపారు అచ్చెన్నా. అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటంట్ పొందింది….2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబల్ డిజిట్ కు పడిపోయునా వైసీపీకి బుద్ది రాలేదని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news